తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.
టీడీపీ కార్యకర్తలు, నేతలు తుఫాను బాధితులకు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. టీడీపీ శ్రేణులు బాధిత వర్గాలకు అండగా ఉండాలి.. చేతనైన సాయం చేయాలన్నారు.
చంద్రబాబు నాయుడు రాయలసీమ వ్యతిరేకి అని, ఆయన రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారన్నారు.
ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతులకు వివాహ సహకారం కోసం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై తన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈ నెల 6వ తేదీ హస్తినకు వెళ్తారు చంద్రబాబు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగులో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు..
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ.. అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ చీకటి దాడులు చేసిందంటూ ఆయన మండిపడ్డారు. అయ్యన్న ఇంటి గోడ అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపేనని ఆయన ఆరోపించారు. టీడీపీలో బలమైన బీసీ నేతలని…
నేడు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనలో రాష్ట్రంలో పర్యావరణానికి అపార నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కొండలను కొట్టేస్తూ.. ఇసుకను దోచేస్తూ.. జల వనరులను మింగేస్తూ, గనులను కబళిస్తూ పర్యావరణ వినాశనానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలిగిస్తోన్న ఈ ప్రభుత్వ పెద్దలపై ప్రజలు రణం చేయాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. సహజ వనరుల దోపిడితో ప్రకృతికి ఈ…