Chandrababu: తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారు.. ఎక్కడ చూసినా హృదయ విదారకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. పర్చూరు మండలం చెరుకూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. మురికి కాలువలో మురికి తీయాలన్న బుద్ధి, జ్ఞానం ప్రభుత్వానికి ఉండాలన్నారు. రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వచ్చి గాల్లో తిరిగి గాల్లోనే వెళ్లిపోయాడని విమర్శలు గుప్పించారు.
Read Also: RK Roja: తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదు.. జగనన్నే వన్స్ మోర్..
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ఒక వ్యక్తి అహంకారానికి రైతులు బలైపోయారని ఆయన పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే నలుగురు రైతుల ఆత్మహత్య చేసుకున్నారని.. ఎగువన ప్రాజెక్టులు కట్టడం వల్ల కృష్ణా నదిలో నీళ్లు తగ్గాయన్నారు. గత ప్రభుత్వంలో పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క రోడ్డు బాగుందా.. అన్ని వ్యవస్థలు నాశనం చేశాడని ఆయన మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు మళ్లీ కొట్టుకుపోయింది.. గుండ్లకమ్మ గేటు కూడా కాపాడలేని ముఖ్యమంత్రి దద్దమ్మ ఉపన్యాసాలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి ఎవరు కారణం అంటూ ఆయన ప్రశ్నించారు.
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఎవరు కారణం అని అడుగుతున్నామన్నారు. గేట్లు రిపేరు చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అంటూ ఎద్దేవా చేశారు. రెండు టీఎంసీల నీళ్లు గుండ్లకమ్మ నుంచి సముద్రంలోకి వెళ్లాయి అది నా బాధ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక పైన ఉన్న ప్రేమ రైతులపై, అభివృద్ధిపై లేదన్నారు. రైతుల బాధ పట్టించుకోని ముఖ్యమంత్రిని దేవుడు ఎలా క్షమిస్తాడని.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నష్టపరిహారాన్ని కూడా తగ్గించి ఇస్తున్నారన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయిందన్నారు. రైతులు తరపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చంద్రబాబు తెలిపారు. రైతు రాజ్యం తీసుకురావడానికి టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తుపాను కారణంగా భారీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి కేంద్రాన్ని సాయం కూడా అడగలేదన్నారు. ఏపీకి సాయం కోసం ప్రధానికి నేనే లేఖ రాస్తానని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!