రోగనిర్ధారణ సౌకర్యాల విస్తరణపై ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసేందుకు , వ్యాధికి టీకాలు వేయడానికి సంబంధించిన అభివృద్ధి చెందుతున్న ధోరణులను అన్వేషించడానికి మంకీపాక్స్పై టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మంకీపాక్స్ వ్యాప్తికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజారోగ్య సంసిద్ధత , ప్రతిస్పందన కార్యక్రమాలను సమీక్షించడానికి ప్రధానమంత్రి.. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో జూన్ 26న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు పిటిఐకి తెలిపాయి. కేబినెట్ కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు, కేంద్ర…