కూటమి లో ఐక్యత పూర్తి స్థాయిలో ఉందని చెప్పడం కోసమే అనంతపురం సభ ఏర్పాటు జరిగిందా...కూటమి నేతల్లో పై స్థాయిలో...సఖ్యత కింద స్థాయి వరకు ఉండాలనే సంకేతాలు ఇచ్చారా...తాజా పరిణామాలు చూస్తే ఇలాగే ఉన్నాయి....కూటమి ఐక్యత కొనసాగిస్తూ....ముందుకు వెళ్లడమే ప్రధాన ఎజెండా గా సభ జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఐక్యత ఇలాగే వర్ధిల్లుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్దిక సమానత్వం సాధించడానికి పెట్టిన పథకాలివి.. కేవలం సూపర్ సిక్స్ లే కాదు, చాలా సిక్స్ లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొట్టిందన్నారు..