కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
Droupadi Murmu: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం లీడర్ ద్రౌపది ముర్ము భారత వాయుసేన ఫైటర్ జెట్ సుఖఓయ్-30 MKIలో తొలిసారి ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శనివారం యుద్ధవిమానంలో ప్రయాణించారు. శనివారం ఉదయం తేజ్ పూర్ లోని భారత వాయుసేన ఎయిర్ బేస్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు భద్రత బలగాలు సైనిక వందనం సమర్పించారు.