2024 దీపావళికి విడుదలై, సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరించిన ‘క’ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. అయితే, తాజాగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కిరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘శ్రీ చిదంబరం గారు’ అనే సినిమా ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ.. ‘క-2’ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.…