Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఒక విద్యాసంస్థలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో పాలిటెక్నిక్ విద్యార్థులపై HOD కేబుల్ వైర్లతో దాడి చేశాడు. ఈ ఘటన తుర్కల ఖానాపూర్ శివారులో ఉన్న రత్నపురి ఇనిస్టిట్యూట్లో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, హోంవర్క్ పూర్తి చేయలేదని ఆగ్రహించిన హెచ్ఓడీ శివారెడ్డి ఏకంగా 15 మంది విద్యార్థులను కేబుల్ వైర్లతో విచక్షణ రహితంగా కొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా కొట్టడంతో పలువురు విద్యార్థుల కాళ్లపై…
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి బీచ్కు వెళ్లిన యువతిపై దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. సదరు విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గోపాల్పూర్ బీచ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రారంభంలో ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.
విద్యార్థులకు క్రమశిక్షణ సంస్కారం నేర్పాల్సిన ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఆనంద్ అరాచకం సృష్టించాడు. ఒంట్లో బాగా లేదన్నా వినకుండా 8 మంది విద్యార్థినిలను పీఈటీ చితకబాదాడు.