దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్ కుదేల్ అయిపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్కు జోష్ తెప్పించింది.
Stock Market: భారత స్టాక్ మార్కెట్ బుధవారం అద్భుతమైన ర్యాలీని చూసింది. మార్కెట్ క్లోజ్ కావడానికి కొన్ని గంటల ముందు సెన్సెక్స్, నిఫ్టీ బాగా పెరిగాయి. ఇది పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలను పెంచింది. బిఎస్ఈ సెన్సెక్స్ 487.20 పాయింట్లు (0.60% పెరిగి) 82,344.68 వద్ద ముగిసింది, నిఫ్టీ 167.35 పాయింట్లు (0.66% పెరిగి) 25,342.75 వద్ద క్లోజ్ అయ్యింది. బిఎస్ఈలోని టాప్ 30 స్టాక్లలో ఎనిమిది మాత్రమే క్షీణించగా, మిగిలిన 22 బలమైన లాభాలను సొంతం చేసుకున్నాయి. ఈ…