Stock Market: దళాల్ స్ట్రీట్లో బుల్ గర్జన.. స్టాక్ మార్కెట్లో లాభాల జాతర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: భారత స్టాక్ మార్కెట్ బుధవారం అద్భుతమైన ర్యాలీని చూసింది. మార్కెట్ క్లోజ్ కావడానికి కొన్ని గంటల ముందు సెన్సెక్స్, నిఫ్టీ బాగా పెరిగాయి. ఇది పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలను పెంచింది. బిఎస్ఈ సెన్సెక్స్ 487.20 పాయింట్లు (0.60% పెరిగి) 82,344.68 వద్ద ముగిసింది, నిఫ్టీ 167.35 పాయింట్లు (0.66% పెరిగి) 25,342.75 వద్ద క్లోజ్ అయ్యింది. బిఎస్ఈలోని టాప్ 30 స్టాక్లలో ఎనిమిది మాత్రమే క్షీణించగా, మిగిలిన 22 బలమైన లాభాలను సొంతం చేసుకున్నాయి. ఈ రోజు బిఈఎల్ షేర్లు అత్యధికంగా 8.90 శాతం పెరిగి రూ.453కి చేరుకుంది. ఎటర్నల్ షేర్లు 5 శాతం పెరిగి రూ.266కి రీచ్ అయ్యింది. బజాజ్ ఫైనాన్స్, ఫిన్సర్వ్, ట్రెంట్, పవర్గ్రిడ్ అన్నీ 2 శాతం లాభపడ్డాయి. మారుతి సుజుకి, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్ నష్టాలతో ముగిశాయి.
READ ALSO: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 35 అజెండా అంశాలకు ఆమోదం..
Also Read
- RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
- Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
- Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
పెట్టుబడిదారులు ఎంత లాభాలను ఆర్జించారంటే..
ఈ రోజు స్టాక్ మార్కెట్ మిడ్, స్మాల్ క్యాప్ రంగాలలో కూడా బలమైన ర్యాలీని చూసింది. నిఫ్టీ మిడ్క్యాప్ 100.. 954 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100.. 371 పాయింట్లు లాభపడింది. దీంతో పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలు గణనీయంగా పెరిగాయి. బిఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.453.67 లక్షల కోట్ల నుంచి రూ.459.64 లక్షల కోట్లకు పెరిగింది, మొత్తంగా చూస్తే ఈ రోజు మార్కెట్ దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగింది.
స్టాక్ మార్కెట్ లాభపడటానికి రీజన్స్ ఇవే..
బుధవారం భారత స్టాక్ మార్కెట్ పెరుగుదలకు అతిపెద్ద కారణం భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్ – ఈయూ చాలా వస్తువులపై సుంకాలను తగ్గించడానికి లేదా పూర్తి సుంకాల రహితంగా చేయడానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం భారతదేశ ఎగుమతులను పెంచుతుందని, అనేక కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ను మార్చింది. దీంతో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ బలమైన లాభాలను చవిచూశాయి. ముఖ్యంగా మార్కెట్ ముగియడానికి కొన్ని గంటల ముందు మార్కెట్ గణనీయమైన లాభాలను నమోదు చేసింది. ఈ రోజు స్టాక్ మార్కెట్లో స్టార్లైట్ షేర్లు 20% పెరిగి రూ.103కి చేరుకుంది. తేజస్ నెట్వర్క్స్ షేర్లు 15% , డేటా ప్యాటర్న్స్ షేర్లు 13.63%, హిందూస్తాన్ కాపర్ షేర్లు 12.67%, ఆయిల్ ఇండియా షేర్లు 9%, మోతీలాల్ ఓస్వాల్ షేర్లు 8% మేర పెరిగాయి.
READ ALSO: Plane Crashes: విమాన ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన నాయకులు వీరే!
తాజావార్తలు
-
Vivo Y31T 5G: 7200mAh బ్యాటరీతో Vivo Y31T 5G.. 120Hz స్క్రీన్, 50MP కెమెరా.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే
-
ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
-
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
-
Rapo 23 : విలన్ వేటలో రామ్.. ఫైనల్గా బాలీవుడ్ హీరో ఫిక్స్
-
TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!