భారీవర్షాలు, వరదలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. జిల్లాకు ఇవాళ,రేపు భారీవర్ష సూచన ఉందన్నారు కలెక్టర్ హరినారాయణ. ఈ ఏడాది జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, ఇప్పటికే చెరువులు,డ్యాంలు పూర్తిగా నిండాయన్నారు. నదులు, వాగులు,నీటి ప్రవాహాలను దాటవదని, రేపు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా వుంచామని కలెక్టర్ హరి నారాయణ తెలిపారు.మరోవైపు తిరుపతి వెస్ట్ చర్చి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది నీటి ప్రవాహం. దీంతో వాహనాల అనుమతిని నిలిపివేశారు అధికారులు.…