పట్ట పగలే కత్తులు, బ్యాట్ లతో సినీ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి చేశారు కొంతమంది దండగులు. ఈ రోజు హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టింది హైడ్రా. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్టు సమాచారం.
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పై కేసుల ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ రావుపై పలు పోలీస్ స్టేషన్ లో చీటింగ్, ల్యాండ్ కబ్జాలు, ఫోర్జరీ, బెదిరింపులు మోసాలు పాల్పడ్డ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కమిషనరేట్ లో 16 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. 2012లో బంజారాహిల్స్ లో సంధ్య శ్రీధర్ రావు పై కేసు వుంది. 2016లో శ్రీధర్ రావు పై సీసీఎస్ లో కేసు నమోదయింది. 2017 లో సీసీఎస్లో ల్యాండ్ గ్రాబింగ్…