బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాలోనూ తళుక్కుమంటున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రల్లోను రాణిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం ఈ నెల 19న విడుదల అవుతోంది. సినీ గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి శ్రీముఖి కలిసి నటించగా.. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. కాగా, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ వేగాన్ని పెంచింది.…