Cooking Oil: మధ్య తరగతి ప్రజలపై మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగబోతుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర సర్కార్ ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల రేట్లు పెరగనున్నాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్భనానికి అడ్డుకట్ట వేసేందుకు, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్ , డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెరుగుతున్న ఇంధన రేట్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్రం కాస్త ఉపశమనం కలిపించింది. కేంద్రం బాటలోనే కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు వ్యాట్ ను కూడా తగ్గించాయి. ఇదిలా ఉంటే వరసగా పెరుగుతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక…