Sony Pictures India: సోనీ పిక్చర్స్ ఇండియా తన నెట్వర్క్లోని ఛానల్స్ అన్నింటినీ రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. సోనీ బ్రాండ్ పవర్ మరియు వ్యాల్యూస్ ఇన్నాళ్లూ తమ వర్క్ ఎథిక్స్కి వెన్నెముకగా నిలిచాయని, అవి ఇప్పుడు తమ ఛానల్ బ్రాండ్ ఆర్కిటెక్చర్లోనూ ప్రతిబింబిస్తాయని సంస్థ ఎండీ, సీఈఓ ఎన్ పీ సింగ్ చెప్పారు. రీబ్రాండింగ్కి సంబంధించిన పనులను మూడేళ్ల కిందట ప్రారంభిస్తే ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చాయి.