సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు సోనియా గాంధీని ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. డాక్టర్ అరూప్ బసు పర్యవేక్షణలో ఆమెకు చికిత్స జరుగుతోంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. సోనియా గాంధీ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. Also Read:Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న…
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆమెను ఆసుపత్రి గ్యాస్ట్రోలజీ విభాగంలో చేర్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోనియా గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. Also Read:Nagarjuna : కుబేర హీరో శేఖర్ కమ్ములనే..…