Gill vs Rohit: భారత వన్డే జట్టుకు సంబంధించిన కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సూచించారు. శుభ్మన్ గిల్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి, మళ్లీ రోహిత్ శర్మను నియమించాలని కోరారు.
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీం ఇండియా చేపట్టబోయే కీలకమైన ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం జట్లను ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటన అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది. Also Read :Shubman Gill : రోహిత్ శర్మకు…
భారత క్రికెట్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం, అక్టోబర్ 4వ తేదీన సమావేశమైన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ, భారత వన్డే జట్టు కెప్టెన్గా యువ సంచలనం శుభ్మాన్ గిల్ను నియమించింది. వారాలుగా సాగుతున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులో ఉన్నా కానీ కెప్టెన్సీ బాధ్యతలు గిల్పైనే పడ్డాయి. Also…