టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల్లో ముగ్గురు ప్రముఖులు మృతి చెందడంతో టాలీవుడ్కు ఏమైందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. నవంబర్ 27న ప్రముఖ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. ఒక్కరోజు గ్యాప్లో అంటే నవంబర్ 28న ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కరోనా వల్ల ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో రెండు రోజుల గ్యాప్లో నవంబర్ 30న దిగ్గజ…
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘మగధీర’, ‘బాహుబలి’ లాంటి చిత్రాలకు క్లాసిక్ సాంగ్స్ ని ఇచ్చిన శివ శంకర్ మాస్టర్ ఎప్పుడు సెట్ లో యాక్టివ్ గా కనిపించేవారట.. ప్రస్తుతం ఆయన చివరి కోరిక.. తీరలేదని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చివరికోరిక వింటే ఆయన తన వృత్తిని ఎంతలా ప్రేమిస్తారో అర్ధమవుతుంది.…
తెలుగు చిత్రసీమను ఏలిన నృత్య దర్శకుల్లో శివశంకర్ మాస్టర్ శైలి విభిన్నం! శాస్త్రీయ రీతుల్లోనూ, జానపద బాణీల్లోనూ నృత్యభంగిమలు కూర్చి ప్రేక్షకులను రంజింప చేయడంలో మేటిగా నిలిచారు శివశంకర్. ఆయనకు సింగిల్ కార్డులు తక్కువేమీ కాకున్నా, సింగిల్ సాంగ్స్ తోనే పలు మార్లు భళా అనిపించారు. తెలుగునాట శివశంకర్ శిష్యప్రశిష్యులు ఎందరో రాజ్యమేలుతున్నారు. వారితోనూ పోటీపడి నర్తనంలో భళా అనిపించారు మాస్టర్. భావి నృత్యకళాకారులకు శివశంకర్ మాస్టర్ దిశానిర్దేశం చేస్తూ పలు సలహాలు, సూచనలతో అనేక కార్యక్రమాల్లో…
కోవిడ్-19 సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆదివారం (నవంబర్ 28) రాత్రి తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టరు చనిపోయే ముందు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు శివ శంకర్ చికిత్స పొందుతున్న ఏఐజీ హాస్పిటల్స్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీనియర్ కొరియోగ్రాఫర్, నటుడి పార్థివ దేహాన్నిఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు చివరి నివాళులర్పించేందుకు హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం…
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతి పట్ల జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. శివశంకర్ మాస్టర్ మరణం బాధాకరమని, కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించానని పవన్ తెలిపారు. శాస్త్రీయ నృత్యంలో పట్టు ఉన్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారని కొనియాడారు. రామ్చరణ్ మగధీరలో శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు అందించిన పాట…
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా శివశంకర్ మాస్టర్ మృతి పట్ల స్పందించారు. శివశంకర్ మాస్టర్ మృతి నన్ను కలిచివేసిందని… ఆయన మరణం కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. శివశంకర్ మాస్టర్తో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. Read Also: బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివశంకర్…
శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో కళ్యాణ సుందరం-కోమల అమల్ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు సుగన్య. ఇద్దరు కుమారుల పేర్లు విజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్. 1975లో ‘పాట్టు భరతమమ్’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. 800కు పైగా చిత్రాలకు నృత్యాలు సమకూర్చిన శివశంకర్ మాస్టర్కు మగధీర సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. అరుంధతి, మహాత్మ, బాహుబలి ది…
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు.…
ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోం క్వారంటైన్ లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో తాను మాట్లాడినట్లు తెలిపాడు. ఆయన రెండో కుమారుడు అజయ్తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. Read Also: గ్రీన్ ఇండియా…