కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎలుగుబంటును పట్టుకునేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలుగుబంటికి ఆపరేషన్ టీం డాక్టర్ మత్తు ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి సొమ్మసిల్లి పొలంలో పడిపోయింది. అనంతరం ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు.
కిరాతకుడు రాజు కోసం పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. తెలంగాణ మొత్తంగా పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా పంతంగి వద్ద రాజు దొరికాడంటూ సిసి టివి ఫుటేజ్ లో దృశ్యాలు చూసి వెతుకుతున్నారు. వాడు- వీడు ఒక్కటేనంటూ సోషల్ మీడియా ప్రచారం చేసింది. పంతంగి టోల్ గేట్ సమీపంలో రాజు మాదిరిగా ఉన్న వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చౌటుప్పల్, పంతంగి పరిసర ప్రాంతాలు రాజు తిరుగుతున్నాడను విస్తృతంగా ప్రచారం జరిగింది.…