Jammu Kashmir: దక్షిణ కాశ్మీర్లోని కొకర్నాగ్ లోని దట్టమైన గడోల్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి ఎలైట్ 5 పారా యూనిట్కు చెందిన ఇద్దరు ఆర్మీ కమాండోలు అదృశ్యమయ్యారు. దీంతో ఉమ్మడి భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పిపోయిన సిబ్బంది అగ్నివీర్ జవాన్లు అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటన కోట్రాంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిర్ గాలా పైన ఉన్న ధేరి ఖతుని ప్రాంతంలో జరిగింది. నివేదికల ప్రకారం, రాత్రి 7:20 గంటల సమయంలో ఆ ప్రాంతంలో 10 నుండి 15 రౌండ్ల కాల్పులు వినిపించాయి. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జమ్మూ, కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు…
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉధంపూర్ జిల్లాలోని రామ్నగర్లో మార్తా గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర దళాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులను కనుగొన్నారు. ఈ కాల్పుల్లో 2-3 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమాచారాన్ని డీఐజీ ఉదంపూర్-రియాసీ రేంజ్ రైస్ మహ్మద్ భట్ తెలిపారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత…
Terrorist Attack: 2025 జనవరి 25న, జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఉగ్రవాద ఘటన చోటుచేసుకుంది. బిల్వార్ ప్రాంతంలోని భటోడి, మువార్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై అర్థరాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, సైన్యం ఎదుకాల్పులు చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదనపు డైరెక్టర్ జనరల్…
Jammu Kashmir: ఈరోజు ఉదయం 7 గంటలకు జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్లోని శివాలయం సమీపంలోని బట్టల్లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన 32 ఫీల్డ్ రెజిమెంట్ వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేసింది. కెర్రీలోని బట్టాల్ ప్రాంతంలోని అసన్ దేవాలయం సమీపంలో భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదుల ఉనికి గురించి గ్రామస్థులు సమాచారం అందించారని ఆర్మీ…
Search Operation: మహారాష్ట్రలో తెలంగాణ ఆబ్కారీ అధికారుల భారీ ఆపరేషన్ చేసారు. కల్తీకల్లు కోసం ఉపయోగించే క్లోరోహైడ్రేట్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు మహారాష్ట్రకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. అక్కడే నాలుగు రోజులు నిఘావేసి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. గత తొమ్మిది నెలలుగా పరారీలో ఉన్న ఇద్దరు నిందితులును సైతం అదుపులోకి తీసుకున్నారు ఆబ్కారి అధికారులు. ఈ ఏడాది జనవరిలో 560 కిలోల క్లోరోహైడ్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు…
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లోని సాంబా, పూంచ్ జిల్లాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న భద్రతా దళాలు శనివారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దీపక్ సింగ్లా, చండీగఢ్ లోని ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం నివాసాలతో సహా పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడులు కొనసాగుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్నాయా అనేది స్పష్టంగా లేనప్పటికీ., జామ తోటల పరిహారం స్కామ్ సంబంధించి లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఫెడరల్ ఏజెన్సీ దాడులు నిర్వహిస్తోందని…
కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎలుగుబంటును పట్టుకునేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలుగుబంటికి ఆపరేషన్ టీం డాక్టర్ మత్తు ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి సొమ్మసిల్లి పొలంలో పడిపోయింది. అనంతరం ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు.