మధ్యప్రదేశ్ సర్కారు చేపట్టిన పోషకాహార పథకంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్కూల్ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్మాల్ జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది.