న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న భారత్.. నేడు నాలుగో టీ20కి సిద్ధమైంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్కు మంచి రికార్డు ఉన్న విశాఖలో మ్యాచ్ జరగనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2026 ముందు భారత బ్యాటర్లు చెలరేగుతుండడం సానుకూలాంశం. అయితే ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ మాత్రం జట్టుకు ఆందోళనకరంగా మారింది. సంజుకు నాలుగో టీ20 చివరి అవకాశం అని తెలుస్తోంది.…
భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్లో సంజు శాంసన్ భవితవ్యంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మూడో టీ20 మ్యాచ్ సంజూ కెరీర్కు కీలక మలుపుగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా మరోసారి విఫలమైతే.. జట్టులో అతని స్థానం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంటే.. టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. మూడో టీ20లో సంజూ శాంసన్ విఫలమైతే.. నాలుగో టీ20 నుంచి…