కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారాణంగా సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోందని, షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని సందీప్ తెలిపాడు. సీనియర్ నటులు పోసాని కృష్ణ మురళీ, భీమనేని శ్రీనివాసరావు, దేవి ప్రసాద్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఘంటశాల విశ్వనాథ్ సంగీతం అందిస్తున్నారని, మహి సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నెరవేర్చుతున్నారని దర్శక…