Udayanidhi: డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మం పై చేసిన ప్రకటన ఎంత వివాదాస్పదం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సనాతన ధర్మానికి సంబంధించి తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. "తమిళనాడు ప్రజలను, సీఎం ఎంకె స్టాలిన్ను తాను చాలా గౌరవిస్తానని మమతా బెనర్జీ తెలిపింది. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉంటాయన్నారు. భారతదేశం 'భిన్నత్వంలో ఏకత్వం' అని ఒక వర్గానికి హాని కలిగించే ఏ విషయంలోనూ తాము జోక్యం చేసుకోమన్నారు.