ఇటీవల దక్షిణ కొరియాలో ప్రారంభించిన సామ్ సంగ్ మొట్టమొదటి గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్ ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. దీనిని ప్రపంచ మార్కెట్ కు తీసుకురావడానికి సామ్ సంగ్ రెడీ అవుతోంది. కొత్త ట్రై-ప్యానెల్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ టాబ్లెట్ లాంటి 10.0-అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్నర్ డిస్ప్లే, 6.5-అంగుళాల పూర్తి-HD+ కవర్ స్క్రీన్తో వస్తుంది. గెలాక్సీ చిప్సెట్ కోసం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అమర్చారు. 16GB వరకు RAM, 1TB నిల్వ,…
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ ఫోన్ను రిలీజ్ చేసింది. ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రమే విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవనుంది. కంపెనీ తాజాగా అన్బాక్సింగ్ వీడియోను రిలీజ్ చేసింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.…
మార్కెట్ లో ట్రైఫోల్డ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. దిగ్గజ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో ట్రైఫోల్డ్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా సామ్ సంగ్ తన కొత్త ట్రైఫోల్డ్ హ్యాండ్ సెట్ తో మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించింది. మంగళవారం, కంపెనీ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్ అయిన సామ్ సంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ను విడుదల చేసింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో సేల్ ప్రారంభంకానుంది. ముఖ్యంగా,…