Mother: బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. భర్తతో గొడవ పడిన కోపంలో కన్న బిడ్డల్ని కడతేర్చింది. ముగ్గురు పిల్లల్ని చంపినందుకు పోలీసులు మహిళను సోమవారం అరెస్ట్ చేశారు. 36 ఏళ్ల సీమా దేవి తన భర్త చందన్ మహత్తతో గొడవ పడింది. ఈ గొడవ జరిగిన తర్వాత పిల్లల్ని తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత బావిలో పడేసింది.