సౌత్ ఇండియాలో తన నటనతో, డాన్స్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ జెండా పాతేందుకు సిద్ధమైంది. అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న ‘ఏక్ దిన్’ చిత్రంతో ఆమె హిందీ వెండితెరకు పరిచయమవుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, సాయి పల్లవి ఇందులో ఒక అరుదైన వ్యాధితో బాధపడే యువతిగా కనిపిస్తోంది. ఆమెను ప్రాణంగా ప్రేమించే హీరో (జునైద్), ఆమెతో…