ఇదిలా ఉంటే, ఐసీ 814 నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐసీ 421 విమానం హైజాక్ ఘటనని గుర్తు చేసుకున్నారు. 1984లో ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. స్విట్జర్లాండ్ జెనీవాలో భారతీయ ప్రవాసులను ఉద్దేశిస్తూ జైశంకర్ మాట్లాడారు. ఐసీ 814 గురించి ఒకరు ప్రశ్నించగా, తనకు ఐసీ 421 హైజాక్లో జరిగిన సొంత సంఘటనని వివరించారు.