S Jaishankar: “IC 421 హైజాక్ విమానంలో నా తండ్రి”.. ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్న జైశంకర్..
- 1984 హైజాకింగ్ ఘటనలో జైశంకర్ తండ్రి..
- ఐసీ 421 విమానంలో ఉన్న కే. సుబ్రమణ్యం..
- ఆనాటి ఘటనని గుర్తు చేసుకున్న విదేశాంగ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: ‘IC 814: ది కాందహార్ హైజాక్’ నెట్ఫ్లిక్స్ సిరీజ్ 1999 నాటి ఖాట్మాండు-ఢిల్లీ ఇండియన్ ఎయిర్లైన్ విమానం హైజాక్ ఘటనను మరోసారి గుర్తు చేసింది. హర్కత్ ఉల్ ముజాహీదిన్కి చెందిన ఐదుగురు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ కంట్రోల్ కాందహార్కి తీసుకెళ్లారు. ఈ హైజాక్లో ప్రయాణికుల్ని రక్షించేందుకు అత్యంత క్రూరమైన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మసూద్ అజార్ మరియు ముష్తాక్ అహ్మద్ జర్గార్ అనే ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సీరిజ్లో ఇద్దరు ఉగ్రవాదుల పేర్లు భోలా, శంకర్ అని పిలవడాన్ని హిందువులు తప్పుపట్టారు.
ఇదిలా ఉంటే, ఐసీ 814 నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐసీ 421 విమానం హైజాక్ ఘటనని గుర్తు చేసుకున్నారు. 1984లో ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. స్విట్జర్లాండ్ జెనీవాలో భారతీయ ప్రవాసులను ఉద్దేశిస్తూ జైశంకర్ మాట్లాడారు. ఐసీ 814 గురించి ఒకరు ప్రశ్నించగా, తనకు ఐసీ 421 హైజాక్లో జరిగిన సొంత సంఘటనని వివరించారు.
Also Read
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
‘‘1984లో హైజాకింగ్ జరిగింది. నేను యువ అధికారిని. హైజాకర్లతో వ్యవహరించే బృందంలో భాగంగా ఉన్నా. హైజాక్ జరిగిన 3-4 గంటల తర్వాత, నేను రాలేనని, హైజాకింగ్ జరుగుతోందని మా అమ్మకు ఫోన్ చేసాను. ఆ ఫ్లైట్లో మా నాన్న ఉన్నారని తెలుసుకున్నాను. హైజాకింగ్ దుబాయ్లో ముగిసింది. అదృష్టవశాత్తూ, ఎవరూ చంపబడలేదు, కానీ అది తప్పుగా ముగిసి ఉండవచ్చు. ఒకవైపు హైజాకర్లతో వ్యవహరించే బృందంలో ఉండటం, మరో వైపు హైజాకింగ్పై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్న కుటుంబ సభ్యుల్లో భాగం కావడం ఆశ్చర్యకరంగా ఉంది.’’ అని చెప్పారు.
1984లో ఏం జరిగింది..?
ఆగష్టు 24, 1984న, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 421 ఢిల్లీ విమానాశ్రయం నుండి చండీగఢ్ మరియు జమ్మూ మీదుగా శ్రీనగర్కు బయలుదేరింది. చండీగఢ్లో విమానం దిగగానే నిషేధిత ఆల్ ఇండియా సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్కు అనుబంధంగా ఉన్న ఏడుగురు హైజాకర్లు బోయింగ్ 737-2A8 విమానం కాక్పిట్లోకి దూసుకెళ్లారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు జర్నైల్ సింగ్ భింద్రన్వాలేను విడుదల చేయాలని కోరుతూ విమానాన్ని హైజాక్ చేశారు. వారిని కూడా అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశారు.
36 గంటల పాటు జరిగిన ఈ హైజాక్లో విమానం పఠాన్ కోట్, లాహోర్, కరాచీ, చివరకు దుబాయ్కి చేరింది. చివరకు హైజాకర్లు అందరూ అధికారులకు లొంగిపోయారు. దీంతో 68 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది క్షేమంగా విడుదలయ్యారు. హైజాక్ అయిన విమానంలోనే జైశంకర్ తండ్రి, సివిల్ సర్వెంట్ కే. సుబ్రమణ్యం ఉన్నారు. జైశంకర్ తండ్రి ఐఏఎస్ అధికారి. ఇందిరాగాంధీతో పాటు అనేక మంది ప్రధానులతో పనిచేశారు.
తాజావార్తలు
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!