Su-57 fighter Jet: ఆపరేషన్ సిందూర్ తర్వాత మన ‘‘ఎయిర్ పవర్’’ ఏంటో పాకిస్తాన్కు అర్థమైంది. భవిష్యత్ సంఘర్షణల్లో ఎయిర్ఫోర్స్ కీలకమనేది స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారత్ తన వైమానిక దళాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. శత్రువులతో యుద్ధం మాత్రమే కాకుండా, శత్రు రాడార్లకు దొరకకుండా దాడి చేసే ‘‘5వ తరం యుద్ధ విమానాల’’ కొనుగోలుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రష్యా తయారీ సుఖోయ్ సు -57ను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.