స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుస నష్టాల మధ్య మార్కెట్లలో ఉపశమన ర్యాలీ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఈ ర్యాలీకి కారణమయ్యాయి. మరోవైపు 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండువారాల కనిష్ఠానికి చేరడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం సూచీలకు కలిసొస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.16 వద్ద కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 398 పాయింట్ల లాభంతో 52663 వద్ద,…
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు గురువారం నాడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 52,265 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 15,556 వద్ద స్థిరపడింది. ఒక దశలో 600 పాయింట్ల వరకు సెన్సెక్స్ లాభపడుతుందని విశ్లేషకులు భావించారు. అటు నిఫ్టీ కూడా 15,600 పాయింట్లను దాటుకుని వెళ్లింది. అయితే చివరకు లాభాల జోరు తగ్గింది. ఈరోజు ట్రేడింగ్లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఆటో,…
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు విలవిలలాడాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఫలితంగా సెన్సెక్స్ 709 పాయింట్ల భారీ నష్టంతో 51,822 వద్ద ముగియగా నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 15,413 వద్ద స్థిరపడింది. గత రెండు రోజులు లాభాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ముచ్చటగా మూడోరోజు అలాంటి లాభాలను చవిచూడలేక చతికిలపడ్డాయి. నిఫ్టీ 50లో ఐదు కంపెనీలు లాభాల్లో ముగియగా..…