గజ్వేల్ (మం) ప్రజ్ఞాపూర్ వద్ద రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. వెంటన స్పందించిన అటుగా వెళ్తున్న వాహనదారులు గాయపడ్డ వారిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు…