JaggaReddy: సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ దగ్గర గంజి మైదాన్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తున్నారు.. 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..? అని ప్రశ్నించారు.