Maruti:ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.2160 కోట్ల నోటీసులు అందాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ స్వయంగా వెల్లడించింది. అక్టోబర్ 3, మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్కు నోటీసు గురించి సమాచారం ఇస్తూ, పెండింగ్లో ఉన్న రూ. 2,160 కోట్ల బకాయిల కోసం ఆదాయపు పన్ను శాఖ నుండి డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ను అందుకున్నట్లు తెలిపింది.