Palnadu Crime: పల్నాడు జిల్లాలో తల్లీకొడుకుల మృతి కలకలం సృష్టిస్తుంది. రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ ఏడు నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండడంతో భార్య త్రివేణితో కలిసి నర్సరావుపేట ఆసుపత్రికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాల్వ వద్ద బైకు స్కిడ్ అయ్యింది. దీంతో బైకుపై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయిన భార్య, కొడుకు కోసం గాలించినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్లంతైన…