Rohit Sharma Records: బుధవారం (అక్టోబర్ 16) నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లక్ష్యంగా ఆడుతున్న టీమిండియా.. సొంతగడ్డపై ఈ సిరీస్ను సైతం ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తొలి టెస్టు బెంగళూరులో, రెండో టెస్టు పుణెలో, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి. ఈ సిరీస్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. అవేంటో ఓసారి చూద్దాం.…
India vs New Zealand: భారత్ వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు ప్రాంచైజీలకు అక్టోబర్ 31 తుది గడువు. ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతించి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయమై చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీకి, రోహిత్ శర్మకు మధ్య…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ముంబైలోని ఓ సిగ్నల్ వద్ద అభిమానికి సెల్ఫీ ఇచ్చాడు. అంతేకాదు షేక్ హ్యాండ్ ఇచ్చి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘హిట్మ్యాన్ గ్రేట్’, ‘రోహిత్ సూపర్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: Hardik Pandya: బంగ్లా చిన్న జట్టు.. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు: ఆర్పీ సింగ్ ఇటీవల బంగ్లాదేశ్ టెస్టు…
Rohit Sharma To Play World Cup 2027: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్మ్యాన్ ప్రస్తుతం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమిండియా ఫైనల్ చేరే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వన్డేలు, టెస్టులకు రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హిట్మ్యాన్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్…
AB De Villiers About Rohit Sharma Joins in RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ను ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. గతంలో ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూ రూ.90 కోట్లు కాగా.. సారి రూ.120 కోట్లకు పెంచారు.…
ప్రతీ టెస్టు సిరీస్ తర్వాత ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును బీసీసీఐ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన అవార్డును.. గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చాక కూడా బీసీసీఐ కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ అనంతరం ఫీల్డింగ్లో మెరిసిన ఆటగాళ్లకు అవార్డును ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించారు. ఈసారి ఇద్దరు ప్లేయర్లకు దక్కడం విశేషం. వెనక్కి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన మహ్మద్ సిరాజ్తో పాటు సిరీస్…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించేందుకు తాము చాలా రిస్క్ తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బ్యాటర్లు రిస్క్ తీసుకుని దూకుడుగా ఆడే క్రమంలో 100 పరుగులకు ఆలౌటైన ఫర్వాలేదనే మైండ్సెట్తో ఉన్నామని తెలిపాడు. పిచ్ పెద్దగా సహకరించకున్నా.. టీమిండియా బౌలర్లు గొప్పగా రాణించారని ప్రశంసించాడు. రెండో టెస్టు విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. డ్రా అవుతుందనుకున్న రెండో టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన భారత్..…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ రోహిత్ (8), గిల్ (6) విఫలమైనప్పటికీ.. జైస్వాల్ (51), కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్లో…
కాన్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 47 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. షద్మాన్ ఇస్లామ్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. ముష్ఫికర్ రహీమ్ (37) రాణించాడు. టీమిండియా బౌలర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్స్ పడగొట్టారు. భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ లక్ష్య చేధనకు దిగనుంది.…