రణవీర్ సింగ్, ఆలియా భట్ లు ‘గల్లీ బాయ్’ సినిమా తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ‘రాకీ’గా రణవీర్, ‘రాణీ’గా ఆలియా నటిస్తుండగా… వారి గ్రాండ్ పేరెంట్స్ గా ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ కనిపించబోతున్నారు. ధర్మేంద్ర, షబానా అజ్మీ మనవరాలు ఆలియా కాగా జయ…
గత యేడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ అంతా కరోనా బారిన పడ్డారు. కానీ అదృష్టవశాత్తు జయా బచ్చన్ మాత్రం ఆ మహమ్మారి చేతికి చిక్కలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె కొవిడ్ 19 వైరస్ ను తప్పించుకోలేకపోయారు. తాజాగా జరిపిన పరీక్షలలో జయా బచ్చన్ కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం షూటింగ్ ను కాన్సిల్ చేశారు. Read Also…