Delhi Car Blast : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
- ఢిల్లీ పేలుడులో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
- శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
- క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
- బాధితులకు అండగా ఉంటామన్న ఢిల్లీ సర్కార్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన తీవ్ర స్థాయి పేలుడు ఢిల్లీవాసులను భయాందోళనలకు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో సంభవించిన ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం సుమారు 6:52 గంటల సమయంలో, సాధారణంగా కార్యాలయాలు ముగిసి ప్రజలు ఇళ్లకు చేరే సమయంలో ఈ దారుణం జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో, రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మెల్లగా కదులుతున్న ఒక కారులో ఉన్నట్టుండి పెను శబ్దం చేస్తూ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వలన సమీపంలో ఉన్న అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతులలో, గాయపడిన వారిలో కొందరు సమీపంలోని పాదచారులు, ఇతర వాహనాలలో ప్రయాణించేవారు ఉన్నారు. గాయపడిన 20 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.. వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఇది ఉగ్రవాద చర్యనా కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రాంతం ఎర్రకోట (లాల్ ఖిలా) కు సమీపంలో ఉండటం, అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రమైన చాందినీ చౌక్ దారిలో ఉండటం వల్ల ఢిల్లీ భద్రతా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విపత్తుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, మృతులకు, క్షతగాత్రులకు ఆర్థిక సహాయం (ఎక్స్ గ్రేషియా) ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బాధితులకు అండగా ఉంటామని ఢిల్లీ సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం, ఢిల్లీలోని కీలక ప్రాంతాలలో అధిక భద్రత అమలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల నుండి దర్యాప్తు కొనసాగుతోంది.
Priyank Kharge: అమిత్ షాకు మోడీ రహస్యాలు తెలుసు.. కాంగ్రెస్ మంత్రి ఆరోపణలు..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!