Delhi Car Blast : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
- ఢిల్లీ పేలుడులో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
- శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
- క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
- బాధితులకు అండగా ఉంటామన్న ఢిల్లీ సర్కార్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన తీవ్ర స్థాయి పేలుడు ఢిల్లీవాసులను భయాందోళనలకు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో సంభవించిన ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం సుమారు 6:52 గంటల సమయంలో, సాధారణంగా కార్యాలయాలు ముగిసి ప్రజలు ఇళ్లకు చేరే సమయంలో ఈ దారుణం జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో, రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మెల్లగా కదులుతున్న ఒక కారులో ఉన్నట్టుండి పెను శబ్దం చేస్తూ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వలన సమీపంలో ఉన్న అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతులలో, గాయపడిన వారిలో కొందరు సమీపంలోని పాదచారులు, ఇతర వాహనాలలో ప్రయాణించేవారు ఉన్నారు. గాయపడిన 20 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.. వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఇది ఉగ్రవాద చర్యనా కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రాంతం ఎర్రకోట (లాల్ ఖిలా) కు సమీపంలో ఉండటం, అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రమైన చాందినీ చౌక్ దారిలో ఉండటం వల్ల ఢిల్లీ భద్రతా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విపత్తుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, మృతులకు, క్షతగాత్రులకు ఆర్థిక సహాయం (ఎక్స్ గ్రేషియా) ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బాధితులకు అండగా ఉంటామని ఢిల్లీ సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం, ఢిల్లీలోని కీలక ప్రాంతాలలో అధిక భద్రత అమలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల నుండి దర్యాప్తు కొనసాగుతోంది.
Priyank Kharge: అమిత్ షాకు మోడీ రహస్యాలు తెలుసు.. కాంగ్రెస్ మంత్రి ఆరోపణలు..
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!