Inflation : మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి మూలధన లభ్యత పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ బ్యాంకుల నుంచి రుణాలను పొందిన కోట్లాది మంది కస్టమర్లకు ఇది బిగ్ రిలీఫ్ న్యూస్ గా చెప్పవచ్చు. 43వ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని కీలక ప్రకటన చేసింది.