Today Business Headlines 22-04-23: తమిళనాడు పనివేళలు: ప్రైవేట్ కంపెనీలు మరియు ఇండస్ట్రీస్లో పనివేళలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వారంలో నాలుగు రోజులు, రోజుకి 12 గంటలు పనిచేసేలా రూపొందించిన ఒక బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టింది.
నెల రోజులుగా ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రుయాత్ హిలాల్ కమిటీ ముస్లింలకు కీలక ప్రకటన చేసింది. ఆదివారం నాడు ఆకాశంలో నెలవంక కనిపించలేదని.. దీంతో మంగళవారం రంజాన్ పర్వదినం జరుపుకోవాలని సూచించింది. దీంతో సోమవారం పండగ జరుపుకోవాలని ముస్లింలు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకోగా వాటిని మంగళవారానికి వాయిదా వేసుకున్నారు. అటు తెలంగాణలోని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రంజాన్ పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రార్థనా…