Lalu Family Crisis: బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలహాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే లాలూ కూతురు, గతంలో లాలూకు కిడ్నీ దానంగా ఇచ్చిన రోహిణి ఆచార్య సంచలన ఆరోపణలు చేస్తూ.. తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించింది. తనపై చెప్పులతో తేజస్వీ యాదవ్ దాడి చేసినట్లు వెల్లడించింది. తనకు జరిగిన అవమానం గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టింది.