రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామాంధుల చేతుల్లో చిన్నారులు చితికిపోతున్నారు. చిన్నా, పెద్ద.. వావి వరుస కూడా చూడని కామాంధులు కామవాంఛతో రగిలిపోతూ చిన్నారులను కూడా వదలడం లేదు. తాజాగా ఒక అధికార పార్టీ నేత, సర్పంచ్ భర్త.. ఆరేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామ సర్పంచి ఇంట్లో మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు.. సిరిసిల్లా టౌన్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.. పార్క్ చేసిన కార్లు.. పడవలుగా మారిపోయాయి కొట్టుకుపోయాయి.. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే.. ముంపులో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నవారు మరికొందరు.. అయితే, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సిరిసిల్లాకు బయల్దేరాయి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు.. హైదరాబాద్లో వరదల సమయంలో.. డీఆర్ఎఫ్ బృందాలు చాలా కీలక పాత్ర పోషించాయి..…
సిరిసిల్లా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం తెల్సుకున్న మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో…
బుల్లెట్ బండి పాట.. ఈ పది పదిహేను రోజుల నుంచి ఓ ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట… ఈ పాట మొదట్లో ఎవరు అంతగా పట్టించుకోకున్న.. ఓ పెళ్లికూతురు డాన్స్ చేయడంతో ప్రచుర్యంలోకి మరింత వచ్చింది. ఈ డాన్స్ తర్వాత రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఓ నర్స్ నృత్యం చేయడం అందరిని ఆకట్టుకుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో చేయడం వివాదానికి దారి తీయడం.. వెంటనే జిల్లా వైద్యాధికారి సుమన్…
ఇటీవలే ఓ నూతన వధువు బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసి ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఆమె డాన్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఎక్కువగా షేర్ అయింది. అయితే తాజాగా ఈ పాటకు ఓ నర్సు చేసిన డాన్స్ వీడియో వైరల్ అయింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్కి చెందిన నర్సు ఆస్పత్రి ప్రాంగణంలో ఈ డాన్స్ చేసింది. కాగా, ఆ నర్సు ఆస్పత్రిలో చేయడంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కలెక్టరు కూడా సీరియస్…
కరోనా ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మనుషులను కర్కసంగా మారుస్తుంది. కొన్ని గ్రామంలో కరోనా సోకినా వారిని మరి దారుణంగా చూస్తున్నారు. రాజమ్మ సిరిసిల్ల జిల్లా వీరపల్లిలో పాజిటివ్ వచ్చిందని ఓ బాలికను ఊరి బయట ఉండాలని ఆదేశించారు. పొల్లాలో చిన్న కవర్ తో గుడిసె వేసి అక్కడే ఉంచారు. దాంతో ఆ బాలిక వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ… రాత్రంతా భయంభయం గా గడిపింది. అయితే ఈ…
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తుండగా.. తెలంగాణలోనూ బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కలవరపెట్టి… ఖమ్మంలోనూ వెలుగు చూసింది బ్లాక్ ఫంగస్.. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆందోళనకు గురిచేస్తోంది.. చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య కి బ్లాక్ ఫంగస్ ను గుర్తించారు వైద్యులు.. 20 రోజుల క్రితం కరోనాబారినపడిన ఆయన.. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం..…