డాక్టర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట.. మహిళ వెన్నుపూసలో సూది, దారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. దీంతో ఆమె నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్కు చెంది లచ్చవ్వ అనే మహిళ తీవ్ర నడుం నొప్పితో బాధపడుతోంది. దీంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంది. అయినా తగ్గకపోగా.. సమస్య మరింత జఠిలంగా మారింది. కానీ వైద్యులకు ఆమె సమస్య అంతుబట్టలేదు. ఆమెది సహజ నొప్పి అని భావించి మెడిసిన్స్ ఇస్తున్నారు. సుమారు రూ.4 లక్షలు ఖర్చుపెట్టినా చివరకు ఫలితం దక్కలేదు.

అయితే ఓ వైద్యుడు మాత్రం లచ్చవ్వ నడుం నొప్పికి సమస్య ఏంటో తెలుసుకోవాలంటే ఎక్సరే తీయాలని సూచించాడు. దీంతో ఆమె వెన్నుపూసలో సూది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గతంలో ఏవైనా ఆపరేషన్లు జరిగాయా అంటూ లచ్చవ్వను వైద్యులు ప్రశ్నించారు. ఆమె జరిగినట్లు సమాధానం చెప్పడంతో ఆ సూది ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేశారు. లచ్చవ్వకు నాలుగేళ్ల క్రితం గర్భాశయంలో గడ్డలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2017 అక్టోబర్లో శస్త్రచికిత్స చేయించుకుంది. ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యులు.. కుట్లు వేసే సమయంలో సూది, దారం మహిళ కడుపులోనే మరిచిపోయారు. రెండేళ్ల తర్వాత లచ్చవ్వకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సూది మొల్లగా వెన్నుపూసలోకి జారి ఆగిపోయింది. అప్పటి నుంచి నడుము నొప్పి ప్రారంభమైనట్టు వైద్యులు గ్రహించారు. అయితే ఆ వెన్నుపూస నుంచి సూదిని బయటకు తీయాలంటే చాలా ఖర్చు అవుతుందని లచ్చవ్వకు తెలిపారు. దీంతో లచ్చవ్వ ఆగ్రహం చెంది గతంలో తనకు ఆపరేషన్ చేసిన వైద్యుడిపై సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల దగ్గర వాపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
Read Also: ఎంపీలకు కేంద్రం మరో షాక్.. ఉచిత విమాన ప్రయాణం రద్దు
తాజావార్తలు
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!