మధ్యప్రదేశ్కు చెందిన జంట రాజా రఘువంశీ-సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత రాజా శవమై కనిపించగా.. తాజాగా అతడి భార్య పోలీసులకు చిక్కింది. భార్యనే కిరాయి ముఠాతో భర్తను చంపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా మేఘాలయ ముఖ్యమంత్రి, డీజీపీ కూడా స్పష్టం చేశారు.
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు.
మేఘాలయలో అదృశ్యమైన హనీమూన్ జంట కేసులో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత రెండు వారాలకుపైగా ఉత్కంఠగా సాగిన మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. మే 23న కొత్త జంట అదృశ్యమైంది.
మేఘాలయలో తప్పిపోయిన ఇండోర్ మహిళ సోనమ్కు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు ఖాసీ హిల్స్ ప్రాంతంలో సోనమ్కు సంబంధించిన రెయిన్ కోట్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు.
మధ్యప్రదేశ్కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ గత నెల 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వచ్చారు. మూడు రోజుల తర్వాత తూర్పు ఖాసీ హిల్స్ కొండ ప్రాంతంలో అదృశ్యమయ్యారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.