MP: హనీమూన్కి వెళ్లి అదృశ్యమైన జంట.. అసలేం జరిగింది?
- హనీమూన్ జరుపుకోవడానికి షిల్లాంగ్కు వెళ్లిన జంట
- షిల్లాంగ్లోని ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిన కొత్త జంట
- అకస్మాత్తుగా అదృశ్యమవ్వడంతో కుటుంబీకుల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.
READ MORE: TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు సభ ముందుకు..
Also Read
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
నిజానికి.. రఘువంశీ రాజు తన భార్య సోనమ్తో కలిసి షిల్లాంగ్ వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న తర్వాత, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, షిల్లాంగ్లోని వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నానని చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు రాజా, సోనమ్లకు నిరంతరం ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆందోళనకు చెందిన కుటుంబీకులు షిల్లాంగ్ చేరుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా చివరిగా ఎక్కడ సిగ్నల్ వచ్చిందో గుర్తించారు. ఆ ప్రదేశానికి చేరుకుని ఓ వ్యక్తిని కలిశారు. రాజా, సోనమ్ గురించి ఆ వ్యక్తికి అడిగారు.
READ MORE: UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
ఈ జంట షిల్లాంగ్ నుంచి కొంత దూరంలో ఉన్న ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిందని, అక్కడ వాతావరణం సరిగ్గా లేదని తెలిపాడు. కొంత సమయం తర్వాత ఆ జంట కనిపించడం లేదని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబీకుల చేసేందేం లేక షిల్లాంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబం ఈ విషయం గురించి ఇండోర్ పోలీస్ కమిషనర్కు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఇండోర్ పోలీసులు షిల్లాంగ్ పోలీసులను సంప్రదించారు. ఇండోర్ పోలీసులు ఆ జంట కోసం వెతకడానికి షిల్లాంగ్కు ఒక బృందాన్ని పంపారు. ఇరు స్టేషన్ల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!