బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వ్యాపారవేత్త దీపక్ కొఠారి చేసిన ఫిర్యాదు మేరకు రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా దంపతులపై జుహు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. సమాచారం ప్రకారం, నిధుల మళ్లింపు లో కీలక పాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులను దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీరు శిల్పా-రాజ్ కంపెనీలో ఉన్నత స్థానాల్లో…