ఐపీఎల్ 2022 సీజన్లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. ప్రస్తుత సీజన్లో విజయం కోసం ఎదరుచూస్తున్న సీఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలినట్లైంది. 4వ ఓవర్ తొలి బంతికే రాబిన్ ఉతప్ప ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అంతేకాకుండా…