తాను డబ్బులు తీసుకొని ఏ ఒక్క ప్రెస్మీట్ పెట్టలేదని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. కావాలంటే నార్కో టెస్ట్ నిర్వహించండి అంటూ ఆయన సవాల్ విసిరారు. ఎఫ్డీసీ ఛైర్మన్ అవ్వకముందు నుంచే ప్రెస్మీట్లు పెట్టానన్నారు. గత 15 ఏళ్లుగా ప్రెస్మీట్ నిర్వహిస్తున్నానన్నారు. పెయిడ్గా ఒక్క ప్రెస్మీట్ పెట్టినా వేరే దేశానికి వెళ్లిపోతానన్నారు.