AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. సచివాలయంలో దాదాపు 3 గంటలకు పైగా కేబినెట్ భేటీ కొనసాగగా.. ముఖ్యంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి మండలి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సమావేశంలో 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB)లో చర్చించిన పలు పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.39,436 కోట్ల విలువైన…