Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.