Home
Pulwama
Pulwama News
-
Mehbooba Mufti: “జై శ్రీరాం” నినాదాలు చేయాలని ముస్లింలను సైన్యం బలవంతం చేసింది..
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) నాయకురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం రోజున 50 ఆర్ఆర్కు చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి ప్రవేశించి, అక్కడి ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. రెచ్చగొట్టే విధంగా సైన్యం ప్రవర్తించిందని దీనిపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైనీని ఆమె కోరారు. -
Terror Funding Case: ఉగ్రవాదులకు నిధుల కేసు.. కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా, షోపియాన్లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది. -
Bus Accident: పుల్వామాలో బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్వామా జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గాయపడ్డారు. -
Terrorist Encounter: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. -
Pulwama Attack: పుల్వామా సైనికుల త్యాగానికి నాలుగేళ్లు.. అమర జవాన్లకు దేశం నివాళులు
2019, ఫిబ్రవరి 14.. 40 ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్న రోజు. దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రోజు. 40 మంది ధైర్యవంతులు వీరమరణం పొందిన రోజు. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సైనికులపై దాడి జరిగి నేటికి నాలుగేళ్లు. -
EAM S. Jaishankar: ముంబై దాడులతో పుల్వామా, ఉరీ దాడులను పోల్చి చూడండి..
EAM S. Jaishankar Comments on india's foreign policies:భారత విదేశాంగ విధానం గురించి విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. నేను ఏం చేస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. విదేశాంగ శాఖ మంత్రిగా యూఎస్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు ప్రయాణిస్తున్నానని మీరు చదివి ఉంటారు..కానీ నేను ఏం చేస్తానో, ఓ విదేశాంగ మంత్రి ఏం చేస్తాడో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. -
Jammu Kashmir: పుల్వామాలో ఎన్ కౌంటర్…ఉగ్రవాది హతం
జమ్ము కాశ్మీర్ పుల్వామాలో అలజడి రేగింది. భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం అయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. మరికొందరి కోసం గాలింపు ముమ్మరం సాగుతోంది. ఇంకా ఉగ్రవాదులు వున్నారని భద్రతా బలగాలు చెబుతున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పుల్వామాలోని నైనా బట్పోరాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ను నిర్వహించాయి. రెండురోజుల క్రితం ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్… -
కరుడుగట్టిన ఉగ్రవాది ఖతం..
కరుగుడట్టిన ఉగ్రవాదిని జమ్మూ కశ్మీరులో ఖతం చేశాయి భద్రతాబలగాలు.. అత్యంత భయానక ఉగ్రవాది అయిన ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును… ఇవాళ మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ… పుల్వామాలోని నాగ్బెరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఇ-మహ్మద్ (జెఎమ్) తో అనుబంధంగా ఉన్న అగ్రశ్రేణి పాకిస్థాన్ తీవ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపోరా పట్టణ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో ఇంకా గుర్తించబడని మరో ఉగ్రవాది కూడా మరణించాడు. ఘటనా స్థలం నుంచి… -
పుల్వామాలో మరో ఎన్కౌంటర్…ముగ్గురు తీవ్రవాదులు హతం…
పుల్వామాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు హతం అయ్యారు. పుల్వామాలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కాసమాచారంతో ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి జాయింట్ ఆపరేషన్ను నిర్వహించాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ చేస్తుండగా పాక్ కు చెందిన లష్కర్ ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం పుల్వామాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూను విధించారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు…
తాజావార్తలు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..